సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి నేడు, శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్‌ తుపానుగా మారుతుందని రేపు, శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు . శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను నేపథ్యంలో.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నేడు, శుక్రవారం ఉదయం ఏపీ సీఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్షించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *