సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. ఇటీవల వైసీపీ పెయిడ్ బాచ్ సోషల్ మీడియాలో రెచ్చిపోతుందని,. తనను, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను తిట్టించడానికి వైసీపీ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్కి భారీగా ఫండింగ్ ఇస్తోందని ఆరోపించారు.. కొంతమంది యు ట్యూబర్ లకు, రీల్స్ కు డబ్బులు ఎరచూపి తమపై దుష్ప్రచారం చేయిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో సైబర్ దాడులు, అసభ్య పోస్టులు పెట్టడం పెరిగిపోయిందని .. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
