సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా,నల్లజర్ల మండలం వీరవల్లిలో నేడు, బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీరవల్లి టోల్‌గేట్‌ వద్ద 500 మీటర్ల సూచిక బోర్డును కారు చాల వేగంగా ఢీకొట్టింది. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వైపునకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడి పరిస్థితి చాల విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వచ్చి మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *