సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం వాదవాలె ఘనంగా నిర్వహిస్తున్నారు. సందర్భంగా నేడు శుక్రవారం భీమవరం పట్టాన శివారులోని , గొల్లలకోడేరులోని ఇస్కాన్ సెంటర్లో జరిగిన వేడుకల్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, నూతనంగా నిర్మించిన పూజా మందిరం (హాల్) ను ప్రారంభించారు. అనంతరం కాళ్ళ మండలం, పెద అమిరం గ్రామంలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేక పూజల్లో పాల్గొని, శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.
