సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని గునుపూడి లో ఉన్న పవిత్ర పంచారామ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు నేడు, గురువారం అనగా ది.0 9- 07- 2026వ తేదీన ఉదయం 9-00 గంటలకు శ్రీ స్వామివారి దేవస్థానం నందు హుండీలు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గ్రామస్తులు వాలంటీర్లు సమక్షంలో తెరిచి లెక్కించగా 112 రోజులు కు రూ. 11,02,607 /- ఆదాయం లభించింది.. మరియు 4 ,అమెరికా డాలర్లు వచ్చాయి. . మరియు శ్రీ స్వామివారి శాశ్వత నిత్యా అన్నదానం హుండీ ద్వారా రూ.31,045/- రూపాయలు ఆదాయం లభించింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ భీమవరం తనిఖీ దారు P. S.సాయి కుమారి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ చింతలపాటి బంగా ర్రాజు ఆలయ అర్చకులు,బ్యాంక్ సిబ్బంది ,భక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు.
