సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో తాజగా ప్రకటించిన కార్పొరేట్ స్థాయి పదవులలో ఏపీ ప్రభుత్వ కృష్ణ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా భీమవరం కు చెందిన టిడిపి సీనియర్ నాయకుడు గంటా త్రిమూర్తులు భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ పోలీట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈసందర్భంగా గంట త్రిమూర్తులు మాట్లాడుతూ.. తనకు చైర్మన్ పదవి రావడానికి సిఫార్సు చేసిన తోట సీతారామలక్ష్మి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జిల్లా పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు ఇంచార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ బీసీ మినిస్టర్ సవిత టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మంత్రివర్యులు కూటమి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *