సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నేడు, మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు. చింతూరు మండలం బొద్దుగూడెం వద్ద జాతీయ రహదారిపై మినీ వ్యాన్ను వేగంగా వేసిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృతులు అందరు ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
