సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని దుర్గాపురం పరిధిలోని 38,39 వార్డుల్లో ప్రజలకు స్వచమైన త్రాగునీరు అందించడానికి నేడు, ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అక్కడ నిర్మించిన 1000 కే సేవా రిజర్వాయర్ నుండి 43 లక్షల 82 వేల రూపాయల నిధులతో నిర్మించనున్న నీటి పంపిణి లైన్ లకు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నేతలతో పాటు మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ పాల్గొన్నారు.
