సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: క్రిస్మస్ సం బరాల వేళ .. యూరప్ దేశాలలో మంచు దాటికి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. .శీతాకాలపు మం చు తుపానుతో అమెరికా ప్రజలు గజగజ లాడుతున్నారు! ఎక్కడిపడితే అక్కడ భారీగా కురుస్తోన్నమంచు, చలిగాలులకు.. స్థానిక ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోయాయి అంటే పరిస్థితి ఎంతటి దారుణమో? వారికీ అతిపెద్ద పండుగ క్రిస్మస్ సమీపిస్తోన్న వేళ పండగ ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధం గా మారింది. ముఖ్యంగా మిన్నియాపొలిస్, సెయింట్ పాల్, న్యూ యార్క్, షికాగో తదితర నగరాలలో గత గురువారం ఒక్క రోజే వేలాది విమానాలు రద్దయినట్లు సమాచారం. మరోప్రక్క మంచు పేరుకొనిపోవడంతో రోడ్డు మార్గాలు మూసివేశారు. మధ్య అమెరికాలో లక్షలాది పౌరులకు మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇంత చలిలో థియేటర్స్లో అవతార్ 2వంటి సినిమాలకు ప్రేక్షకులు రాలేకపోతున్నారు.
