సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: శ్రీరామనవమి పర్వదినాన్ని పునస్కరించుకొని భద్రాచలం వెళ్లే భక్తులకు భీమవరం ఆర్టీసీ బస్సు స్టాండ్ నుండి ప్రత్యక బస్సులు ఏర్పాటు చేసారు. మార్చి 29న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భద్రాచలానికి ప్రత్యక సర్వీసులు నడుపుతున్నారు, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులు రామభక్తులు కు అందుబాటులో ఉంటాయి, సీతారాముల కల్యాణం అనంతరం భక్తులు తిరిగి వచ్చేందుకు 30న ఉదయం నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే భీమవరం నుండి (జిలాల్లోని నాలుగు డిపోల నుంచి) తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకు నాలుగు డిపోల నుంచి సూపర్ లగ్జరీ వీడియో కోచ్ బస్సులు ఏర్పాటు చేసారు. ఏప్రిల్ నాలుగో తేదీ రాత్రి ఏడు గంటలకు ఈ బస్సులు బయలుదేరతాయి,
