సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ ప్రతి బుధవారం కువైట్కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసును నడపనుంది. ఈ సర్వీసు నేటి బుధవారం నుండి (ఈనెల 29నే ప్రారంభం )ఉదయం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు అత్యంత ఆదరణ ఉన్న దేశాలకు విజయవాడ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. విజయవాడ నుంచి షార్జాకు ఇటీవలే తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించింది. దీంతో షార్జాకు రెండు సర్వీసులు అయ్యాయి. తాజాగా విజయవాడ నుంచి కువైట్కు రెగ్యులర్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ విమానం తిరుచిరాపల్లి నుంచి విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి నేరుగా కువైట్ వెళుతుంది. 180 సీటింగ్తో విజయవాడ నుంచి నేటి, బుధవారం 70 మంది ప్రయాణికులు కువైట్ వెళుతున్నారు. ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుతుంది. కువైట్లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు విజయవాడ వస్తుంది.
