సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ బహిరంగ సభలో నేటి బుధవారం సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు, . పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. మొదటి కేకు ముక్కను స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి కేకు తినిపిస్తున్నట్లు శ్రేణులకు పోజు చూపించారు. అనంతరం వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘‘41 సంవత్సరాల క్రితం చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారు. తెలుగుజాతి కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశమని చెప్పారు. ఎన్టీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం. సంస్కరణలకు మారు పేరు ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశంపార్టీ ఉంటుంది. తెలుగు దేశం పార్టీ కి ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి’’ అని చంద్రబాబు అన్నారు, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘యావత్ తెలుగు జాతికి ఇవాళ పండుగ రోజు. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు తెదేపా హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగు జాతి చరిత్ర మారింది. పసుపు జెండా అంటే ఆత్మగౌరవమని గుర్తించాలి. ఎన్టీఆర్ వచ్చాక తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చింది. హైదరాబాద్ సిటీ విదేశాలతో పోటీ పడటానికి కారణం చంద్రబాబు. ఏపీకి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రుల దురదృష్టకరం అని వివాదాస్వదా వ్యాఖ్యలు చేసారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, నందమూరి బాలకృష్ణ, పార్టీ తెలుగు రాష్ట్రాల నేతలు హాజరయ్యారు.
