సిగ్మాతెలుగు డాట్, న్యూస్: సినిమాల కంటే సోషల్ మీడియాలో అందరికి సుపరిచితురాలు అయిన నటి పూనమ్ కౌర్, ఆమె తాజగా విడుదల చేసిన ట్విట్ మరింత సంచలనం రేపుతోంది.. ఆమె ఎమ్మన్నారంటే .. ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడలేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు.( బీజేపీ ఎంపీ ఫై నిరసనగా) కనీసం వారికి అనుకూలంగా ఒక్క మాటైనా వీరు మాట్లడలేకపోయారే? కానీ వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తం గా ఉండండి. అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేసారు. ఈ వ్యాక్యలు ఎవరినుద్దేశించి ఆమె చేసిందో వారి అభిమానుల నుండి త్రీవ్ర స్థాయి ట్రోల్స్ కు ఆమె గురిఅవుతుంది.
