సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహిళలకు ఇష్టమైన శుభకార్యాల శ్రావణ మాసం వచ్చేసింది. పైగా శ్రావణ శుక్రవారం. మహిళలకు మరింత ఇష్టమైన బంగారానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అయితే మరి ఈ రోజు బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారమే కాదు.. వెండి కూడా స్థిరంగానే ఉంది. ఇక డిమాండ్ పెరిగే రోజులే కాబ్బటి మరల రోజు రోజుకు ధర పెరిగే అవకాశం ఉంది, కాబట్టి ఈరోజు కొనుగోలు చెయ్యవచ్చు..తెలుగు రాష్ట్రాలలో నేడు శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,100కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020కి చేరింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో ధర రూ.72,500గా ఉంది.
