సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేడు, ఆదివారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు మోటుపల్లి కోట నాగ సత్యనారాయణ కుటుంబ సభ్యులు 10 గ్రాముల బంగారం కానుకగా అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. వీరికి ఆలయ అర్చకులు మద్దిరాల రమణశర్మ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ముత్యాల వెంకటరామారావు ఫోటో శేషవస్త్రం అందజేశారు.
