సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచాన్నే వణికించిన కరోనా సమస్య ఇంకా సమసి పోలేదు.. అయితే ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమవడంతో మెల్లమెల్లగా కారోనా పాజిటివ్ కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో నేడు శనివారం ఒక్కరోజే 148 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు డిసెంబర్ 9న ఈ వివరాలు తాజాగా ప్రకటించింది. కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 808కి పెరిగింది. అయితే దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 20.67 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకటించింది
