సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘జనంలోకి టీడీపీ జనసేన’ .. అంటూ ఇరు పార్టీల నేతలు సంయుక్తంగా కలసి ఉమ్మడి ప్రచారాన్ని నేడు, శుక్రవారం భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో నేటి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నిర్వహించారు. నేతలు గడపగడప కు వెళ్లి రాష్ట్రం లో వైసిపి నియంతృత్వ పాలన లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని , ఇకనైనా ప్రజలు మేల్కొని రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపు నిస్తూ తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలు చేసే ప్రయోజనాలను రాష్ట్ర అభివుద్ది ని వివరిస్తూ ప్రచారం మొదలు పెట్టారు.
