సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన తిరుమలగా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమలలో నేటి శనివారం నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వేలాదిగా భక్తులు తెలుగు రాష్ట్రాల నుండి తరలి వస్తున్నారు. నేటి ఉదయం 8గంటలకు వేదపారాయణ తదుపరి,ఉదయం 9.30 గంటలకు స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరణ తో మంగళవాయిద్యాలతో వేడుకలు ప్రారంభం అయ్యాయి.. బ్రహ్మోత్సవ శోభతో చిన్న వెంకన్న క్షేత్రం అందమైన వెలుగులు, పుష్ప అలంకారాలుతో సరికొత్త పశ్చిమలొ.. చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది. క్రోధి నామ సంవత్సర వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. వాహనశాల నుంచి గజ, అశ్వ, సూర్యప్రభ, చంద్రప్రభ, హంస, సింహ తదితర వాహనాలను తీసుకొచ్చి వాటిని ఉత్సవాలకు సిద్ధం చేశారు. ఆలయ పరిస రాలను పూలమాలికలు, అరటి బోదెలు, మామిడి తోరణాలతో అలంకరించారు. నేటి రాత్రి 7 గంటలకు గజవాహనంపై శ్రీవారి తిరు వీధిసేవ నిర్వహించనున్నారు.
