సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ గెలుపు తరువాత ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యకుండానే పిఠాపురంలో టీడీపీ, జనసేన ఇరుపార్టీల మధ్యఇటీవల వరుసగా విభేదాలు రాజుకొంటున్నాయి. మొన్న రాత్రి టీడీపీ వర్మ కారుపై జనసేన కార్యకర్తలు దాడి,, తనను చంపడానికి దాడి చేసారని వర్మ తీవ్ర ఆరోపణలు.. వారిని కాకినాడ ఎంపీ మద్దతుదారులుగా గుర్తించడం..ఇంకా చల్లారక ముందే తాజాగా మరో వివాదం రాజుకొంది. తాటిపర్తిలో జనసేన, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలు ను స్థానిక జనసేన నాయకులకు గతపాలక వైసీపీ మద్దతుదారులు కమీటీ అప్పగించింది. అయితే తాజగా ఆలయ బాధ్యతల కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నేతలు అడుగడుగున ఘోరంగా అవమానిస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.ఆలయ తాళాలు గ్రామ కమిటీకి గాని, పూజారికి గానీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. నేడు, ఆదివారం అమ్మవారి ఆలయం ముందు టీడీపీ నేతల నిరసన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *