సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 17నుండి 4 రోజుల పాటు జరిగేశాసనసభ సమావేశాలు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తానని రాష్ట్ర మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురంలో తన పర్యటన ఉంటుందని నియోజకవర్గంలో కార్యకర్తలను కలిసిన అనంతరం దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. తనకు అన్ని వైపుల నుంచి, వర్గాల నుండి శుభాకాంక్షలు, అభినందనలు అందుతూనే ఉన్నాయని చెప్పారు. జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారని చెప్పారు. తనను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారని చెప్పారు. త్వరలో 21 నియోజకవర్గాలలో వారందరిని జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నానని, ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల చేస్తానని తెలిపారు. తన పర్యటనలో అభినందనలు తెలియజేయడానికి వచ్చే వారు పూలబొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *