సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగా స్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ నేడు, బుధవారం కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఊపిరితిత్తులు పని చెయ్యని కారణంగా శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 2007లో మెగా స్టార్ చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉన్న సమయంలో అయన 2వ కుమార్తె ప్రేమ వివాహం తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంచలనం.. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత భరద్వాజ్ బీజేపీ లో యువనేతగా కొనసాగడం, కొన్ని సంవత్సరాల తరువాత భార్య భర్తల మధ్య పొరపొచ్చలు రావటం 2014లో విడిపోవటం జరిగింది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. తరువాత శిరీష్ భరద్వాజ్ ఇంకొక వివాహం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *