సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఆషాడ మాసం లో వాడవాడలా శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభము అవుతున్న నేపథ్యంలో ..స్థానిక 20 వ వార్డు లో శ్రీ మావుళ్ళమ్మవారి పూర్వపు గుడి వద్ద స్థానిక యూత్ నిర్వహిస్తున్న శ్రీ అమ్మవారి జాతరను స్థానికులు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు ఆయన కుమారుడు గ్రంధి రవితేజ చేసిన ప్రత్యేక పూజలు అనంతరం మేళతాళాలు డప్పుల శబ్దాల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భముగా శ్రీ మావుళ్ళమ్మవారికి ప్రతీకగా పూజలు అందుకొనే పవిత్ర గరగ ను గ్రంధి శ్రీనివాస్ తలపై పెట్టుకొని శ్రీ అమ్మవారికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానికులు కులమతాలకు అతీతంగా పాల్గొనడం విశేషం. మందిరంలో
