సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉంగుటూరు మండలం నారాయణపురం ( గణపవరం వద్ద) గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెరుమాళ్ల లక్ష్మీనారాయణ (34), పెరుమాళ్ళ లోక్ వినోద్ (32) వరాణసి (కాశీ )లో ఆత్మహత్యకు పాల్బడిన సమాచారం తాజగా వెలుగులోకి వచ్చింది. భేల్పూరా పోలీస్స్టేషన్ పరిధిలోని సోనాపూర్లోని మానస సరోవర్ ప్రాంతం లోని రామ్తారక్ ఆంధ్రా ఆశ్రమంలో గత మంగళవారం ఇరువురు సోదరుల మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నా యని భేల్పూర్ ఏసీపీ ధనుంజయ్ మిశ్రా తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు. కాశీలో ఆగస్టు 28 నుంచి రూమ్ తీసుకున్నట్లు నిర్ధారించారు. కాగా ఈ అన్నదమ్ముల అదృశ్యం విషయమై స్థానిక చేబ్రోలు పోలీస్టేషన్లో న్యాయవాది తల్లిబోయిన రాజేష్ ఈ యేడాది మేనెల 15వ తేదీన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.ఆ అన్నదమ్ములు నలుగురు వ్యక్తుల వల్ల మానసికంగా ఆందోళన చెందుతున్నామని వాట్సప్ ద్వారా వీడియోను కుటుంబ సభ్యులకు పంపారు. వీరిరువురు రియల్ ఎస్టేట్ , ఫైనాన్స్ వ్యాపారం చేస్తూండేవారని అయితే వీరికి క్రికెట్ బెట్టింగ్ వ్యసనం? తో బుకీలకు అప్పులు చెల్లించాలని…దీంతో వారి ఒత్తిడి తట్టుకోలేక ఈపని చేసినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది.
