సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు బుధవారం ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లపై {సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ) సర్వే (ఎంఎస్ఎం ఈ) ప్రారంభం కానుంది. జిల్లా పరిశ్రమలశాఖ ఆఽధ్వర్యంలో జరిగే ఈ సర్వేలో వ్యాపారాలకు సంబంధించి ప్రతి షాపు, పరిశ్రమల నుంచి పూర్తి స్థాయిలో వారి యాజమాన్యం, పెట్టుబడి , బ్యాంకు ఇతరాత్ర రుణాలు కు సంబదించిన , కావలసిన ప్రభుత్వ సహకారం ఫై వివరాలు నమోదు చేస్తారు. ప్రత్యేక యాప్లో సర్వే వివరాలను నమోదు చేస్తారు. మండలాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో కమిషనర్ల పర్యవేక్షణలో సర్వే చే స్తారు. ఇప్పటికే దీనిపై జిల్లా కలెక్టర్ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలకు, కమిషనర్లకు అవగాహన కల్పించారు.రేపు 4వ తేదీ నుండి సచివాలయ ఉద్యోగులు వారికి కేటాయించిన పరిధులలో సర్వే ప్రారంభిస్తారు.
