సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వైరల్ జ్వరాలతో బాధపడి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ నేటి బుధవారం నుండి మొదటగా కేరళ చేరుకొని దక్షిణ భారత దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల దర్శనం ప్రారంభించారు. ఈరోజు నుంచి 11 ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఆలయాలను పవన్‌కల్యాణ్‌ దర్శించు కోనున్నారు. పవన్ గతంలో.. తిరుమల లడ్డు అపవిత్రత జరిగిందంటూ.. 11 రోజుల దీక్ష చేపట్టిన తరహాలోనే గంధం రంగు ప్రత్యేక డ్రెస్ ధరించి సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు ఆలయాలను పవన్‌ సందర్శిస్తున్నారు. 4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు. ఈరోజు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సందర్శనలో పవన్‌తో పాటు కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనందసాయి పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామస్వామి ఆలయాన్ని దర్శించి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మూడు రోజుల పర్యటనలో అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, అగస్త్య జీవసమాధి, కుంభేశ్వర, స్వామిమలైయ్‌, తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *