సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదం గత శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్ళే హైవేపై ఈ ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో భక్తులతో నిండిన బొలెరో వాహనం, వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారు ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. .
