సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సచివాలయం నెడు, శుక్రవారం తెల్లవారు జామున రెండో బ్లాక్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో బ్లాక్లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా వేశారు.ఈ విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వెంటనే సచివాలయం లోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను ఫైర్ సేఫ్టీ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ప్రమాదవశాస్తూ ఈ సంఘటన జరిగిందా కుట్ర కోణం ఏమైనా ఉందా అనేదానికి అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.ఇంతకీ విషయం ఏమిటంటే.. సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత కార్యాలయాలు ఉన్నాయి. అవి ఏమేర అగ్ని కి ఆహుతి అయ్యాయన్నది ఇంకా తెలియవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *