సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంకేముంది నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేసాయి. ఇక జూన్‌ నెల ఆరంభం కాగానే అంతా వర్షాలే అనుకున్నారు.తీరా చూస్తే ఎండలు ప్రచండంగా మండిపో తున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడ చుసిన గత 10 రోజులుగా ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల మధ్య తగ్గేదేలే అంటూ నిప్పులు కక్కుతోంది. ఉదయం 5గంటలకే వెలుగు వచ్చేస్తుంది. 10 గంటలకల్లా ఎండ దంచి కొడుతోంది.. రాత్రి ఉక్కపోత తగ్గదు. ఆ ప్రచండభానుడి భగభగలతో అట్టుడిగిన ప్రజలు ఫై భీమవరం పట్టణంలో గత రాత్రి 9గంటల నుండి ఒక గంట పాటు వర్షం పడి చల్లగాలులతో కాస్త సేద తీరింది.. మరల నేటి ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచే వాతావరణం ఉక్కబోతగా మొదలయింది. షరా మాములే ఉదయం పది గంటలకే ’ఎండ ఉక్క’రూపందాల్చింది. ఇదిలా ఉండగా ఇదే పరిస్థితి మరో 3 రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ నెల పదో తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ నెల 12న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడు తుందని అంచనా. ప్రస్తుత వాతావరణానికి కారణం మందగించిన రుతుపవనాల కదలిక లేకపోవడమేనని అని వాతావరణ నిపుణులు అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *