సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు నెలరోజులు పాటు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తాజగా.. అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 1న ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. దీంతో పాటు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 21న, పర్యావరణ పరీక్ష జనవరి 23ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు నిర్వహిస్తారు.
