సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్యల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. గ్రంధాలయాలు ఆధునిక దేవాలయాలు అని, ఒక మంచి పుస్తకం స్నేహితుడితో సమానమని, స్వాతంత్రోద్యమంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్ర వహించాయన్నారు. గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి ఎంతోమంది మేధావులుగా తీర్చిదిద్దబడ్డారని, ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అల్లూరి నరసింహరాజు, ఉపాధ్యక్షులు కలిగొట్ల గోపాల శర్మ, కార్యదర్శి మూర్తిబాబు, సంయుక్త కార్యదర్శి అల్లు శ్రీనివాసులు బుద్ధరాజు వెంకటపతిరాజు, కారుమూరి సత్యనారాయణ,, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *