సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లో నేటి శనివారం ఉదయం పెద్ద ఎత్తున జరిగిన 2వ మాలల ఆత్మీయ సమావేశం ను శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రారంబించారు, ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మరియు మాజీ IPS,IRS, అధికారులు వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగు రాష్ట్రాలలో మాలలు ఇప్పటికే కీలక పదవులలో అధికారులుగా, ప్రజా ప్రతినిధులుగా ఉన్నత పదవులలో గౌరవ స్థానాలలో రాణిస్తున్నారని భవిషత్తు లో మరింత ఆశాజనకంగా ఉన్నత స్థితి కి చేరుకోవడానికి అందరి సహకారం కావాలని అందరితో సమన్వయంగా మెలగాలని నేతలు పిలుపునిచ్చారు.
