సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం లో నక్కల కాలువలో ఏళ్ల తరబడిగా ఉన్న పూడికలను స్థానిక రైతుల సహాయ సహకారాలతో సుమారు రెండు కిలో మీటర్ల మేర తీయించి ప్రస్తుతం అకాలువ ను కాలుష్యానికి దూరంగా ప్రజలకు పంట పొలాలకు ఉపయోగపడే విధంగా పూర్తి స్థాయిలో మరల పునరుద్ధరించిన నేపథ్యంలో నేడు, గురువారం ఉదయం ఆకివీడు మండలం, కోళ్ళపర్రు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు గ్రామా పెద్దలు ప్రజలు పుష్ప మాలలతో కృతజ్ఞత పూర్వకంగా సత్కరించారు
