సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తమ మిత్ర దేశం ఇరాన్ ఫై అమెరికా దాడి చేస్తే తామిక మధ్యస్తంగా ఉండే అవకాశం లేదని , ఇరాన్ శత్రువులను తమ శత్రువులుగా భావించే అవకాశం ఉందని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇజ్రాయిల్ అడ్జక్షునికి ఫోన్ లో మర్యాద పూర్వకంగా తేల్చి చెప్పెడం తో యుద్ధ మేఘాలు ఒక్కసారిగా తొలగిపోయాయి. తదుపరి ఏమి జరిగిందో కానీ ట్రంప్ ఇరాన్ ఫై దాడిని విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా గళమెత్తిన వేల మంది ఇరాన్ ప్రజలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయారు. ఇప్పటికే ఎన్నో వేల మంది ఉద్యమ అణిచివేతతో మరణించారు. తమకు అండగా ఉంటానని, ఇరాన్ లో ప్రజా ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను మోసం చేశారంటూ ఇరాన్ ఉద్యమకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
