సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కైకలూరు నియోజకవర్గం, మండవల్లి గ్రామంలో నేడు, ఆదివారం యుగపురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మహానాయకుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృషంరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న తెలుగుతనానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ గా నిలిచారని, అయన ఆత్మాభిమానం తన రాజకీయ జీవితానికి స్ఫూర్తిగా నిలచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ , ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణ , ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
