సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఆంధ్రప్రదేశ్ కు2026 కేంద్రబడ్జెట్‌లో కేటాయింపులు ఒక మోస్తరుగా ఉన్నాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి నిధుల కేటాయింపులు జరిగాయి.పట్టణ తాగునీరు, మురుగునీటి పారుదల: ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం రూ.800 కోట్లు కేటాయించగా, .గ్రామీణ రహదారులు: ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లుమరియు .రహదారులు, వంతెనలు: పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.350 కోట్లు కేటాయించారు. .ఇక ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి:కి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో కేవలం రూ.1,128.91 కోట్లనికేటాయించింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్‌మెంట్:ఐబీఆర్‌డీ (IBRD) నిధుల ద్వారా రూ.432.09 కోట్లుకేటాయించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో రూ.155.32 కోట్లు కేటాయించింది.అంతరిక్ష పరిశోధనలు, సాంకేతికత అభివృద్ధి కోసం ఈ క్రింది సంస్థలని కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో ఎంపిక చేసింది.వీఆర్.సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ (విజయవాడ) మరియు త్రిపుల్ ఐటీ (IIIT) శ్రీసిటి విద్యాసంస్థలకుకేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను ప్రకటించింది.2047 వికసిత్ భారత్ దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిందని,.ఇది ఫార్వార్డ్ లుకింగ్ బడ్జెట్ అని కేంద్ర బడ్జెట్‌తో ఏపీకి కొత్త అవకాశాలు వస్తాయని, ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *