సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ ఆపరేషన్లో అమెరికా తన ప్రధాన లక్ష్యాలను చేరుకున్నప్పటికీ, యుద్ధం ఇప్పుడే ముగియదని, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై మరింత కఠినమైన దాడులు ఉంటాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజగా చేసిన హెచ్చరికలు తో భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి గత బుధవారం సెషన్లో లాభాలతో ముగిసిన సూచీలు, నేడు గురువారం ఒక్కసారిగా పతనం కావడం ట్రేడర్లను ఆందోళనకు గురిచేసింది.సెన్సెక్స్ (Sensex) ప్రారంభ ట్రేడింగ్లోనే దాదాపు 1,452 పాయింట్లు పతనమై 71,681 స్థాయికి చేరుకుంది. నిఫ్టీ (Nifty 50) సుమారు 452 పాయింట్లు (1.99%) క్షీణించి 22,227 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టాన్ని సూచించడంతో, మన మార్కెట్లు భారీ ‘నష్టాలతో ముగిసాయి.
