సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కొత్తగా ఛార్జి తీసుకొన్న.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ నేడు, శుక్రవారం దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం తో సత్కరించారు.పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్య ప్రకాష్ మరియు ఆలయ ధర్మ కర్తలు వీరికి ప్రసాదం ఫోటో అందజేశారు.
