సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం లో గత ఆదివారం రాత్రి కార్గిల్ అమరవీరులకు నివాళ్లు అర్పిస్తూ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో పట్టణ వీధుల గుండా భారత వీర జవాన్ లకు జోహార్లు అర్పిస్తూ భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో బీజేపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీని నిర్వహించారు. తదుపరి భీమవరం పట్టణంలోని పదవి విరమణ చేసిన జవాన్ లకు ఘన సన్మానం నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో కార్గిల్ యుద్ధం కు చాల ప్రాధాన్యత ఉందని అది భారత సైన్యం సాధించిన అపూర్వవిజయం అని దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి యోధునికి ఈ దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు.
