సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి లోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తముగా వైసీపీ , ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో నేడు, మంగళవారం వైయస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. జగన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికలలో చైర్మెన్, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలకు ప్రభుత్వం మొగ్గుచూపుతుంది. కాబ్బటి వైసీపీ ఇదే మంచి అవకాశం గ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలి ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు. మన పార్టీ పోటీ చేయాలి. అయితే ఈ ఎన్నికలు జరుగుతాయా? లేదా? తెలియడం లేదు. ఒకవైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ‘సర్‌’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. అయితే చంద్రబాబు పాలనలో వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే.. రాష్ట్రంలో నేరాలు హత్యలు, మానభంగాలు దేశంలో మన ఏపీకి ప్రధమ స్తానం ఇక్కడ కూటమి ప్రభుత్వం సాధించింది. ప్రతి ఇంటా ఇదే చర్చ. ప్రజలు ఛీ కొడుతున్నారు. ఈ ప్రభుత్వంతో, గత మన 5 ఏళ్ల పాలనను పోల్చి చూస్తున్నారు. అందుకే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా బలపడింది. అందుకే వైసీపీ శ్రేణులు గేర్ మార్చాలి.. ఎక్కడ ఏకగ్రీవం ఎన్నికలు కాకుండా చుడండి. విజయం మనదే.. పక్కా వ్యూహంప్రతి నియోజకవర్గంలో లీగల్‌సెల్, మీడియాసెల్‌,సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చురుకైన పాత్ర పోషించాలి.వెన్నుపోటు పార్టీ ,. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి.. ఇంటింటికీ బుక్‌లెట్‌ పంపిణి చెయ్యాలి . ‘వెన్నుపోటు పార్టీ… వెన్నుపోటు పాలన’ కార్యక్రమాలు నిర్వహించాలి.అని జగన్ నిర్దేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *