సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం, వీరవాసరం మండలం నౌడురు గ్రామ జనసేన అద్యక్షుడు కటిక సురేష్ ఇటీవల ప్రమాదానికి గురై మరణించిన నేపథ్యంలో వారి కుటుంబాన్నినేడు, గురువారం జనసేన జిల్లా అధ్యక్షులు భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు పరామర్శించారు. అయన పార్టీకి చేసిన సేవలు దృష్ట్యా జనసేన పార్టీ తరపున అయన కుటుంబానికి తోడుగా నిలుస్తామని సంఘీభావం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు గుండా రామకృష్ణ , జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ గారు, ఎంపీటీసి లు యాళ్ళబండి ఇందిరా , విజయ లక్ష్మి,గోడి అనంత లక్ష్మి , తోలేరు సర్పంచ్ లీలా కృష్ణా ,భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి కత్తుల నీలేంద్ర , నాయకులు బండి రమేష్ , మాగాపు ప్రసాద్ , అతికల అంజనేయ ప్రసాద్ ,ఉండవల్లి శ్రీను , బాబి , గిరీష్ తదితరులు పాల్గొన్నారు.
