సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పవిత్ర పంచారామ క్షేత్రం గునుపూడిలో వేం చేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి దేవాలయంలో దూరప్రాంత భక్తులకు ప్రతి రోజు నిర్వహించే అన్న సమారాధన కోసం నిత్యాన్నదానం ట్రస్టునకు చినమిరం గ్రామా వాస్తవ్యులు బుద్ధ ర్రాజు లక్ష్మీ సరస్వతి అనే వృద్దురాలు, బుద్ధ ర్రాజు రామరాజు గారి పేరున అన్నదానం చేయుటకు రూ _1,00,116/-లు కానుకగా అందేజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మరియు ధర్మకర్తల మండల సభ్యులు, భక్తులు పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి రామ కృష్ణంరాజు తెలిపారు.
