సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ప్రతిరోజూ ఎంతమంది పౌరులను చంపుతున్న ఇప్పటికే POK పాక్ ఆక్రమిత కాశ్మిర్ లో ప్రజా ఉద్యమాన్ని అణచలేక తల పెట్టుకొంటున్న పాకిస్తాన్ కు తమ దేశంలో 45శాతం భూభాగం ఉన్న బలూచిస్థాన్ రాష్ట్రము స్వతంత్రత దేశంగా ప్రకటించుకున్న విషయంతో ఉన్నపరువు కాస్త పోయింది...తమ దేశాన్ని గుర్తించాలని, తమ దేశ జాతీయ జెండా ప్రదర్శించింది. ఇకపై చమురు, విలువైన ముడి ఖనిజాలంకు తమతో ఒప్పందాలు చేసుకోవాలని భారత్ తో సహా పలుదేశాలకు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లేఖలు రాసింది. తమకు 5 లక్షల సైన్యం ఉందని సుదీర్ఘ తమ భూభాగంలో పాకిస్తాన్ సేనను ఇక అడుగుపెట్టనివ్వమని లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. ఈనేపథ్యంలో ఇటీవల మరోసారి పాకిస్థాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేసింది. బెలూచి ఫై పట్టుకోసం ..సెలవుపై ఉన్న సైనికులను పది బస్సుల్లో తీసుకెళ్తుండగా బలూచిస్థాన్ ప్రావిన్స్లోని మస్తుంగ్ జిల్లాలో బెలూచి ఆర్మీ వాటిపై గురిపెట్టి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 45 మందికిపైగా పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలోనే గాయపడ్డారు. ఇది తమ ఫతా స్క్వాడ్ పనేనని బీఎల్ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడ్డ సైనికులను తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్లపైనా దాడులు చేశారు.
