సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొంతకాలంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పంటకాలువలు ప్రక్షాళన,ఇరిగేషన్ స్థలాలలో ఆక్రమణల తొలగింపు శరవేగంగా జరుగుతున్నా నేపథ్యంలో కాలువలలో అడ్డంకులు, తుళ్లు తొలగింపు, ఆక్వా వ్యర్ధాలు కాలువలో కలవకుండా చర్యలు, మట్టి పూడికలు తొలగింపులతో స్థానికుల నుండి కొంత వ్యతిరేకతలు వస్తున్నాయి. అయితే బాధిత పేద కుటుంబాలకు ఏ నష్టం లేకుండా ఆదుకొంటున్నామని ఎమ్మెల్యే రఘురామా భరోసా ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజగా.. నేడు, శనివారం ఉదయం నుండి పాలకోడేరు లో ఇరిగేషన్ స్థలాలలో నిర్మించిన ఇళ్లను తొలగించడానికి అధికారులు పొక్రేన్లతో సిద్ధం కావడంతో బాధితులు అక్కడ బెటాయించి తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు, వారు చేతిలో పెట్రోల్ సీసాలు పట్టుకొని ఇళ్ళు తొలగిస్తే పెట్రోల్ పోసుకొని దహనం చేసుకొంటామని హెచ్చరిస్తున్నారు. అధికారులు తాము ముందే నోటీసులు ఇచ్చామని ఇప్పుడు సహకరించకపోతే ఎలా ? అని అంటున్నారు. తమకు ఎటువంటి నోటీసులు అందలేదని అకస్మాత్తుగా ఖాళీ చెయ్యమంటే ఎలా బ్రతికేది? అని ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తత గా ఉండటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకొని పరిస్థితి సమన్వయపరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *