సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , భారతీ దంపతులకు తన చిన్న కుమారుడు కొయ్యే చిట్టి రాజు IPS వివాహ ఆహ్వాన పత్రికను నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ,ఆయన కుమారుడు స్వయంగా వెళ్లి అందజేశారు. వచ్చే ఫిబ్రవరి 5వ తేదీన భీమవరంలో జరిగే తన చిన్న కుమారుడు కొయ్యే చిట్టి రాజు వివాహానికి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా వచ్చి తన బిడ్డను ఆశీర్వదించాలని కోరటం తో జగన్ తప్పకుండా భీమవరం వస్తానని హామీ ఇచ్చారు. గతంలో సీఎం హోదాలో ఎమ్మెల్సీ గా ఉన్న మోషేను రాజు పెద్ద కుమారుడు, సుందర్ రాజు వివాహానికి జగన్ భీమవరంలో ఉండి రోడ్ పంక్షన్ హాలుకు రావడం గమనార్హం..
