సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భక్తులకు బంగారు తల్లి తల్లి,,,భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిలువెత్తు మూలవిరాట్ స్వరూపానికి సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భీమాల శ్రీరామమూర్తి సమీప బంధువు నిమ్మల దినేష్ 1లక్ష పదివేలు రూపాయలు విలువ కల 8 గ్రాముల బంగారాన్ని భీమవరం శాసన సభ్యులు, పులపర్తి రామాంజనేయులు చేతులమీదుగా శ్రీ అమ్మవారికి సమర్పించారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.దాతలకు ధర్మకర్తల మండలి ఫోటో ప్రసాదం అందచేసారు.
