సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: యువ క్రికెటర్లకు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదిక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) అని, ఏపీఎల్ క్రికెట్ లీగ్ కు భీమవరం నుంచి ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఏపీఎల్ క్రికెట్ లీగ్ లో విజయవాడ సన్‌ షైనర్స్ తరుపున ఆక్షన్ లో భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థి జి చరణ్ సాయితేజ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సాయి తేజ ను అభినందించి సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ -5 జూన్ 5న ప్రారంభం కానున్నాయని, సింహాద్రి వైజాగ్ లయన్స్, కాకినాడ కింగ్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్, విజయవాడ సన్‌షైనర్స్, భీమవరం బుల్స్, తుంగభద్ర వారియర్స్, రాయలసీమ రాయల్స్ అనే 7 జట్లు పాల్గొంటాయన్నారు. సాయి తేజ, క్రికెట్ లో బాగా రాణించి అంతర్జాతీయ స్థాయికు చేరుకోవాలని తండ్రి జి రమేష్, ఆకుల కృష్ణని, అభినందించారు. చెరుకువాడ రంగసాయి, విజ్జురోతి రాఘవులు, ఆకుల కృష్ణ, చింతా కనకరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *