స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ ఎమ్మెల్యే దంతులూరి నారాయణ రాజు కరుణజన్ములు, యుగ పురుషుడని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం క్విట్ ఇండియా స్థూపం వద్ద శనివారం క్విట్ ఇండియా స్థూప పునః నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య సమర యోధులు దంతులూరి నారాయణ రాజు సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా దంతులూరి నారాయణ రాజు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ దంతులూరి నారాయణ రాజు స్వాతంత్రోద్యమ ఘట్టాలు చరిత్రలో మిగిలి పోయాయని, నారాయణ రాజు భీమవరంలో కళాశాల నిర్మించకపోతే భీమవరం ఇంతా చరిత్ర లేదన్నారు. క్విట్ ఇండియా పునః నిర్మాణ కమిటీ సభ్యులు చెరుకువాడ రంగసాయి, ఇందుకూరి ప్రసాద్ రాజు, అరసవల్లి సుబ్రమణ్యం, కాస్మో పాలిటన్ క్లబ్ అధ్యక్షులు చేకూరి రామభద్ర రాజు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమానికి 1942 లో దంతులూరి నారాయణ రాజు శ్రీకారం చుట్టారని, క్విట్ ఇండియా స్థూపం వారి సేవలకు గుర్తింపుగా నెలకొల్పమని అన్నారు. అనాకోడేరు దంతులూరి నారాయణ రాజు జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధికి దంతులూరి నారాయణ రాజు మనవడు దంతులూరి గోపి రూ లక్ష సహాయం అందించారని అన్నారు. అనంతరం రూ లక్ష విరాళాన్ని హైస్కూల్ ఉపాధ్యాయులు రాపాక వెంకన్న బాబు కు ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో దంతులూరి గోపి, దంతులూరి మురళి కృష్ణంరాజు, అల్లు శ్రీనివాస్, బీఎస్ ఎన్ ఎల్ రాజు, బోండా సుబ్బారావు, జేమ్స్, సీతారామరాజు, వెంకట పతిరాజు, సాగి అప్పలరాజు, కే రంగరాజు తదితరులు పాల్గొన్నారు.
