సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ దేశ వ్యాప్తంగా అత్యంత కీలకమైన.శాఖలలో . యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రకటించింది. ప్రత్యక్ష నియామక పథకం (Direct Recruitment Scheme) కింద వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 98 విభిన్న పోస్టులకు గాను 400కు పైగా ఖాళీలను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు UPSC అధికారిక ORA (Online Recruitment Application) పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూలై 3, 2026 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. ఈ నియామక ప్రక్రియలో సాంకేతిక, శాస్త్రీయ, పరిపాలనా, విద్యా, వైద్య రంగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు, విద్యార్హతలు, అనుభవం, వయో పరిమితులను అధికారిక నోటిఫికేషన్లో జాగ్రత్తగా చదవాలని అధికారులు సూచించారు.
