సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం కి చెందిన కలిదిండి రామరాజు, వల్లిదేవి దంపతులు 50,116/. యాభై వేల నూట పదహారు రూపాయలు కానుకగా అందజేశారు. తదుపరి నేడు, శనివారం ఉదయం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి స్థానిక భక్తులు Gv రజిని TSR లక్ష్మి 4 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. వీరికి ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం అందజేశారు. ధర్మకర్త లు మరియు సంపూర్ణ స్వర్ణమయం కమిటీ సభ్యులు వారికీ ప్రసాదం ఫోటో అందజేశారు.
