సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నీనో ప్రభావంతో కొన్ని వారాలుగా అడపాదడపా వర్షాలు తప్పా.. వర్షాలు పడటంలేదు. భానుడు ప్రచండంగా చెరిగిపోతున్నాడు. . ఉక్కపోతతో కూడిన వాతావరణం.. రైతులలో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో తాజగా వాతావరణ శాఖ వర్షాలపై ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం.. దేశంలో పలుచోట్ల నైరుతి రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.. వచ్చే ఆదివారం నుంచి ఏపీ రాష్ట్రంలో వర్షపాతం క్రమంగా పెరిగి, దేశంలోని పలు ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డి) పేర్కొంది
